రేపు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

రేపు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో రేపు ఉదయం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11.30గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.