జీఓ 16ను రద్దు చేయాలి: తెలంగాణ నిరుద్యోగ జేఏసీ

జీఓ 16ను రద్దు చేయాలి:	తెలంగాణ నిరుద్యోగ జేఏసీ

ఖైరతాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల శాపంగా మారిన జీఓ నంబర్16ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. శనివారం ప్రెస్​క్లబ్​లో జేఏసీ చైర్మన్​శంకర్, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు జె.సైదుల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేండ్లు రాష్ట్రాన్ని నియంతలా పాలించిన కేసీఆర్ దొడ్డి దారిన కాంట్రాక్ట్​పద్దతిలో పనిచేస్తున్న 5 వేల మంది లెక్చరర్లను రెగ్యులైజ్​చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వారిలో దాదాపు వెయ్యి మందికి అర్హత లేకున్నా.. ఫేక్​సర్టిఫికెట్లతో పర్మినెంట్ అయ్యారన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి అనర్హులను గుర్తించాలని కోరారు. సీఎం రేవంత్​రెడ్డి తక్షణమే జీఓ 16ను రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్​ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్​చేశారు. సమావేశంలో బ్రహ్మచారి, సురేందర్, బాలకృష్ణ, బాబు, సంపత్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.