హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తొలి దళిత ఐఏఎస్ రామలక్ష్మణ్ బుధవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు దర్గా దగ్గర ఉన్న మహాప్రస్థానంలో గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించను న్నట్లు కుటుంబీకులు తెలిపారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలం, మునుకుట్ల గ్రామంలో 1944 ఆగస్టు 5న రామలక్ష్మణ్ జన్మించారు. 1976 బ్యాచ్కు చెందిన ఆయన 2004లో ముఖ్య కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ మెంబర్ ఇన్ ది ల్యాండ్గ్రాబింగ్ (ప్రొబిషన్) కోర్టులో పనిచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ క్రియాశీ లంకగా పనిచేశారు. సంక్షేమ సల హాదారుగా సేవలందించారు. ‘ది అల్కెమీ ఆఫ్ లైఫ్’ పేరుతో తన జీవిత చరిత్రను రాశారు.
ఫ్యామిలీకి వివేక్ సానుభూతి
రామలక్ష్మణ్ మృతిపై బీజేపీ స్టేట్ కోర్కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి దిగ్ర్భాంతి చెందారు. పలు ఉన్నత పదవులు ఎంతో సమర్థంగా నిర్వహించిన ఆయన.. దళిత, బహుజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామలక్ష్మణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.