ఊరూవాడా దశాబ్ది సంబురం

ఊరూవాడా దశాబ్ది సంబురం

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్​గౌడ్, వనపర్తిలో మంత్రి నిరంజన్​రెడ్డి, గద్వాలలో డిప్యూటీ స్పీకర్​ పద్మారావుగౌడ్, నారాయణపేటలో రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీత లక్ష్మారెడ్డి, నాగర్​కర్నూల్​లో ప్రభుత్వ విప్​ గువ్వల బాల్​రాజు జాతీయ జెండాను ఆవిష్కరించి 
ప్రభుత్వ పథకాలను వివరించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియాగాంధీ ఫొటోలకు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని కొనియాడారు. బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు.  –వెలుగు, నెట్​వర్క్