న్యూఢిల్లీ: గ్లోబల్ ఇంటర్నెట్ కంపెనీ గూగుల్ తమ సంస్థలో బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,400 కోట్ల) వరకు ఇన్వెస్ట్ చేయనుందని టెలికాం కంపెనీ ఎయిర్టెల్ శుక్రవారం ప్రకటించింది. భారతదేశ డిజిటల్ ఎకోసిస్టమ్ను మరింత ముందుకు తీసుకురావడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపింది. ‘‘గూగుల్ రాబోయే ఐదేళ్లలో ఈ డబ్బును సమకూరుస్తుంది. కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలు చేయడానికి అదనంగా 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుంది. ఎయిర్టెల్ నుంచి ఒక్కో షేరును రూ.734 చొప్పున కొనడానికి 300 మిలియన్ డాలర్ల వరకు చెల్లిస్తుంది’’ ఎయిర్టెల్ పేర్కొంది. అందరికీ స్మార్ట్ఫోన్లను అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా చూడటం, ఇండియా కోసం ప్రత్యేకంగా 5జీ నెట్వర్క్ ఏర్పాటు చేయడం, మనదేశంలోని అన్ని బిజినెస్ల కోసం క్లౌడ్ ఎకోసిస్టమ్ నిర్మించడంపై ఈ పార్ట్నర్షిప్ ఫోకస్ చేస్తుందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. ఇన్నోవేటివ్ ప్రొడక్టుల ద్వారా గూగుల్, ఎయిర్టెల్ ఇండియాలో డిజిటల్ వాడకాన్ని మరింత పెంచుతాయని చెప్పారు. లేటెస్ట్ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, లాస్ట్మైల్ డిస్ట్రిబ్యూషన్, పేమెంట్స్ ఎకోసిస్టమ్ను డెవెలప్ చేస్తామని ప్రకటించారు. ‘‘ఎయిర్టెల్ భారతదేశం డిజిటల్ భవిష్యత్తును రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కనెక్టివిటీని పెంచడం కోసం ఈ కంపెనీతో కలసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎక్కువ మంది భారతీయులకు క్వాలిటీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేలా మేం ప్రయత్నిస్తాం” అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. తమ గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్కి యాక్సెస్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు. స్మార్ట్ఫోన్లు మరింత మంది వాడేలా చూస్తామని, కొత్త బిజినెస్ మోడల్స్కు సాయపడటానికి కనెక్టివిటీని మెరుగుపర్చుతామని వివరించారు. ఇండియా క్లౌడ్ సేవల వాడకాన్ని పెంచడంపై రెండు కంపెనీలు దృష్టి పెడతాయని పిచాయ్ వివరించారు.
డీల్ విలువ బిలియన్ డాలర్లు
- బిజినెస్
- January 29, 2022
లేటెస్ట్
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత