- తెల్లాపూర్ నైబర్ హుడ్ ప్రెసిడెంట్ రమణ
రామచంద్రాపురం, వెలుగు: సహజ వనరులైన చెరువులు, కుంటలకు పరిరక్షించుకొని వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందకు రావాలని తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ పిలుపునిచ్చారు. శనివారం జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో నైబర్ హుడ్ సభ్యులు, స్థానిక ప్రజలు తెల్లాపూర్ మేళ్ల చెరువును శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు తేడా లేకుండా చెత్తా చెదారం ఎత్తి పోశారు.
రమణ మాట్లాడుతూ ఇప్పటికైనా చెరువులను పట్టించుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నైబర్ హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేళ్ల చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేష్ సభ్యులు దీప్తి రెడ్డి, రవి కిరణ్, రామ్ కుమార్, నరేందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
