
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై సినిమా ఇండస్ట్రీ తమవంతు ప్రచారం చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది. ఈ విషయంపై టాలీవుడ్కు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్స్ యాజమాన్యాలు తమవంతు బాధ్యత నిర్వర్తించడానికి ఎల్లవేళలా ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు. దీనిపై చర్చించడానికి అతి త్వరలో సీఎంను కలవబోతున్నట్టు ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శులు కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కె. శివప్రసాద రావు తెలిపారు.