
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశం అయ్యారు. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగుంది. ఈ సమీవేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ తోపాటు.. టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో.. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కరణ గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి అవకాశాలు, సినీ రంగం విస్తరణ గురించి కూడా చర్చకు రానున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.