
బ్యాంకాక్ : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి జ్యోతి యెర్రాజీ చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన విమెన్స్ 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి 13.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరి గోల్డ్ మెడల్తో మెరిసింది. దీంతో ఈ కేటగిరీలో ఇండియా తరఫున స్వర్ణం గెలిచిన తొలి విమెన్ అథ్లెట్గా రికార్డులకెక్కింది. మెన్స్ 1500 మీటర్ల రేస్లో అజయ్ కుమార్ సరోజ్ 3:41.51 సెకన్లతో స్వర్ణం గెలుచుకున్నాడు.
మెన్స్ ట్రిపుల్ జంప్ ఈవెంట్లో అబ్దుల్లా అబూబాకర్ 16.92 మీటర్ల దూరం దూకి గోల్డ్ను సొంతం చేసుకున్నాడు. విమెన్స్ 400 మీటర్ల ఫైనల్లో ఐశ్వర్య మిశ్రా (53.07 సెకన్లు), మెన్స్ డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ (7527 పాయింట్లు) బ్రాంజ్ మెడల్ను సాధించారు.