తెలుగు అమ్మాయిలు ధైర్యంగా ఇండస్ట్రీకి రావాలి : అల్లు అర్జున్

తెలుగు అమ్మాయిలు ధైర్యంగా ఇండస్ట్రీకి రావాలి :  అల్లు అర్జున్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌‌‌‌లో సాయి రాజేష్‌‌‌‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఎస్‌‌‌‌కేఎన్ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌‌‌‌తో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ఈ మూవీ టీమ్‌‌‌‌ని అభినందించారు. తాజాగా అల్లు అర్జున్ కూడా టీమ్‌‌‌‌కి కంగ్రాట్స్ చెప్పారు. 

గురువారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఇలాంటి పెయిన్‌‌‌‌ఫుల్ లవ్ స్టోరీలు తెరకెక్కించడం చాలా కష్టం. లైఫ్ నుంచి స్ఫూర్తి పొందితేనే తీయగలం. సినిమా చూసిన తర్వాత టీమ్ అంతా  కలిసి సిక్సర్ కొట్టారు అనిపించింది. ఇందులో చాలా అంశాలు నచ్చాయి. స్టోరీ రాసిన విధానం, తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సులు ఇలా ప్రతీది ఆకట్టుకుంది. 

వారి నటనలో ఎంతో జెన్యూనిటీ ఉంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్..ఇలా అందరూ పాత్రల్లో జీవించారు. తెలుగు హీరోయిన్స్  కనిపించడం లేదనే బాధ నన్నెప్పుడూ వేధిస్తుంది. వైష్ణవి లాంటి తెలుగు అమ్మాయిలు ధైర్యంగా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నా’ అన్నాడు.  ఈ సినిమా తమపై మరింత బాధ్యత పెంచిందన్నారు ఆనంద్, వైష్ణవి, విరాజ్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు సాయి రాజేష్, ఎస్‌‌‌‌కేఎన్. దర్శకుడు మారుతి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.