
కటక్: అల్టిమేట్ ఖో ఖో లీగ్లో నాకౌట్ రౌండ్కు ముందు తెలుగు యోధాస్ తడబడింది. అందరికంటే ముందే సెమీఫైనల్ చేరుకున్న యోధాస్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ పోరులో యోధాస్ 22–42తో గుజరాత్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైంది.
ఈ విక్టరీతో జెయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్కు చేరుకుంది. బలమైన డిఫెన్స్తో గుజరాత్ డిఫెండర్లు మొత్తం 8 డ్రీమ్ రన్ పాయింట్లు రాబట్టారు. ఎటాకింగ్లో ఆర్నవ్, సుబ్రమణి చెరో పది పాయింట్లతో ఆకట్టుకున్నారు.