లష్కర్​ బోనాలకు రండి

లష్కర్​ బోనాలకు రండి
  • సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిని ఆహ్వానించిన ఆలయ కమిటీ

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆలయ కమిటీ కలిసి ఆహ్వానించింది. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియెట్​లో కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలు, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.