పట్టభద్రులకు పదివేలు.. ఉద్యోగులకు బెదిరింపులు

పట్టభద్రులకు పదివేలు.. ఉద్యోగులకు బెదిరింపులు
  • బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

హైదరాబాద్: రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని  అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇటు పట్టభద్రులకు పదివేలిచ్చి ప్రలోభాలకు గురిచేయడం .. అటు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నం జరిగిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. నిన్న రాత్రంతా మేధావుల్ని ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి పట్టభద్రులను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేశారు... అలాగే ఉద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, పట్టభద్రులు, మేధావులు వారి మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని ఓటు శాతం పెంచాలని ఆయన కోరారు.