ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ కేటాయింపులో ఓయూ వీసి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఓయూ వీసీ ఛాంబర్ లోకి చొచ్చుకొని వెళ్లేందుకు నిజాం కాలేజీ పీజీ విద్యార్థులు యత్నించారు. ఈ క్రమంలో వీసీ ఛాంబర్ అద్దాలు, పలు సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఈ సమయంలోనే  పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

హాస్టల్స్ వెంటనే కేటాయించాలంటూ విద్యార్థులు ఓయూ పరిపాలనా భవనంలోకి చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. E2 హాస్టల్ విద్యార్థులు మెస్, హాస్టల్ కోసం అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి వెళ్ళేక్రమంలో విద్యార్థులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పీడీఎస్ యూ సెక్రటరీ ప్రవీణ్ అనే విద్యార్థికి తీవ్ర రక్తస్రావం అయింది. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులను  పోలీసులు అరెస్ట్ చేశారు.