
హైదరాబాద్, వెలుగు:జపాన్ ఈవీ తయారీ సంస్థ టెర్రా మోటార్స్ తెలంగాణలో క్యోరో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈవీ పాలసీ కింద ప్రత్యేక డీలర్షిప్, డిస్ట్రిబ్యూటర్ భాగస్వామ్యాల కోసం ఈ సంస్థ చూస్తోంది.
2026 డిసెంబర్ వరకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రకటన త్రీ-వీలర్ల కంపెనీలకు మేలు చేస్తుందని తెలిపింది. క్యోరో ఆటో గంటకు 55 కి.మీ స్పీడుతో వెళ్తుంది. ఒక్కసారి చార్జింగ్తో 200 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది.