చైనా దూకుడుతో సరిహద్దు సమస్యలు పెరుగుతున్నాయి

చైనా దూకుడుతో సరిహద్దు సమస్యలు పెరుగుతున్నాయి
  •  విదేశాంగ మంత్రి   సుబ్రమణ్యం జైశంకర్

న్యూఢిల్లీ: చైనాను  టార్గెట్ చేశారు  విదేశాంగ మంత్రి   సుబ్రమణ్యం జైశంకర్.  చైనా అభివృద్ధి దాని దూకుడుతో  ఉద్రిక్తతలు తీవ్రం  అవుతున్నాయన్నారు.  భూ భాగాలకు  సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయన్నారు.  చైనా చర్యల  కారణంగా  గతంలో చేసుకున్న  ఒప్పందాలపై  ప్రశ్నలు ఏర్పడుతున్నాయన్నారు . అబుధాబిలో  జరిగిన ఇండియన్  ఓషియన్  కాన్ఫరెన్స్ లో జైశంకర్ పాల్గొన్నారు.  కరోనా తో  హిందూ మహాసముద్ర  దేశాలకు  పెద్ద దెబ్బ  తగిలిందన్నారు. అలాగే... అఫ్గనిస్తాన్ నుంచి  అమెరికా సైన్యం  వెళ్లి పోవడం  కూడా తీవ్ర ప్రభావం చూపిందన్నారు.