- విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్
న్యూఢిల్లీ: చైనాను టార్గెట్ చేశారు విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్. చైనా అభివృద్ధి దాని దూకుడుతో ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్నాయన్నారు. భూ భాగాలకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయన్నారు. చైనా చర్యల కారణంగా గతంలో చేసుకున్న ఒప్పందాలపై ప్రశ్నలు ఏర్పడుతున్నాయన్నారు . అబుధాబిలో జరిగిన ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్ లో జైశంకర్ పాల్గొన్నారు. కరోనా తో హిందూ మహాసముద్ర దేశాలకు పెద్ద దెబ్బ తగిలిందన్నారు. అలాగే... అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లి పోవడం కూడా తీవ్ర ప్రభావం చూపిందన్నారు.