న్యూఢిల్లీ: టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను మొదలుపెట్టడానికి రిలయన్స్తో చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలసి దేశంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరుపుతున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, నెల రోజులుగా ఇవి జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపారు.
ఈ చర్యను ఆటోమొబైల్ రంగంలోకి రిలయన్స్ ప్రవేశించినట్లు భావించరాదని, రిలయన్స్ లక్ష్యం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యాలను నిర్మించడం మాత్రమేనని ఆయన వివరించారు. రిలయన్స్ గత ఏడాది అశోక్ లేలాండ్ భాగస్వామ్యంతో, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత భారీ-డ్యూటీ ట్రక్కును ప్రారంభించింది. జేవీ ఏర్పాటు గురించి రిలయన్స్కు, ఇండస్ట్రీస్ టెస్లాకు పంపిన ఈ–మెయిల్కు సమాధానం రాలేదు.
22న మోదీతో మస్క్భేటీ
మస్క్ ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి మనదేశం రాబోతున్నారు. ఇక్కడ టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలపై ప్రకటన చేస్తారని సమాచారం. మస్క్, మోదీ చివరిసారిగా గత జూన్లో న్యూయార్క్లో కలుసుకున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్నులను తగ్గించాలని ఈ కంపెనీ భారత్లో లాబీయింగ్ చేసింది. తయారీదారులు కనీసం 500 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తే కొన్ని మోడళ్లపై దిగుమతి పన్నులను తగ్గిస్తామని కేంద్రం ప్రకటించింది