దుబాయ్‌‌‌‌లో నంది అవార్డుల వేడుక

దుబాయ్‌‌‌‌లో నంది అవార్డుల వేడుక

తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌‌‌‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుక‌‌‌‌లు దుబాయ్‌‌‌‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతాని రామ‌‌‌‌కృష్ణ గౌడ్‌‌‌‌. సోమవారం ఈ ప్రోగ్రామ్ ఇన్విటేషన్ బ్రోచర్‌‌‌‌‌‌‌‌ను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, నటుడు అలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్  విడుదల చేశారు.

అలీ మాట్లాడుతూ ‘ఏడు సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్‌‌‌‌ను ఈ రూపంలో  మళ్ళీ స్టార్ట్ చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్. అలాగే సీనియర్ నటుల పేరుతో కూడా స్మారక అవార్డ్స్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’ అన్నాడు.  రైటర్ మిట్టపల్లి సురేందర్, ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, హీరోయిన్ భవ్యశ్రీ,  శ్రీశైలం, వాహిద్, నిర్మాత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.