
తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా’ వేడుకలు దుబాయ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. జూన్ 7న ఈ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ఇటీవల అవార్డ్స్ బ్రోచర్ను దుబాయ్లో లాంచ్ చేసిన హీరో సుమన్.. అవార్డుల కార్యక్రమానికి అందరూ హాజరై తెలుగు సినిమా వైభవాన్ని మరింత తేజోవంతం చేయాలని కోరారు.
ఈ అవార్డులను తెలుగు కళాకారులకే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినీ రంగాల వారికి కూడా అందజేయబోతున్నట్టు ప్రతాని రామకృష్ణ గౌడ్ చెప్పారు. టి హోమ్స్ సీఎండీ వైకుంఠరావు, దుబాయ్ ప్రిన్స్ మేనేజర్ బిను చార్లీ, సీఏ రవికుమార్ సింగిరి తదితరులు పాల్గొన్నారు.