టీజీసెట్ పరీక్షలు వాయిదా..పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్ట్ పోన్

టీజీసెట్ పరీక్షలు వాయిదా..పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్ట్ పోన్

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ నెల10 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ స్టేట్​ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) 2025 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 11,14,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు టీజీ సెట్ అధికారులు తెలిపారు. 

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి 12 వరకు ఈ ఎగ్జామ్స్ ను మూడు రోజుల పాటు నిర్వహించాల్సి ఉంది. కాగా,  పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. రెగ్యులర్ అప్​ డేట్స్ కోసం అభ్యర్థులు www.osmania.ac.in లేదా  www.telanganaset.org  వెబ్ సైట్ చూడాలని సూచించారు.