సైబర్ క్రైమ్ పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సంగ్రామ్ సింగ్

సైబర్ క్రైమ్ పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సంగ్రామ్ సింగ్
  •     ఎస్పీ సంగ్రామ్ సింగ్  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్ వద్ద పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 2 నుంచి 12 వరకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 

డిజిటల్ అరెస్ట్​ అంశం పోలీస్ శాఖ పరిధిలో లేదని, ఆ పేరు పై వచ్చే ఫోన్ కాల్స్ మోసపూరితమైనవని తెలిపారు. ఏఐ టూల్స్ ఉపయోగించి ఫొటోలు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటికి భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. బ్యాంకులు ఓటీపీలు, ఈ–కేవైసీ కోసం ఫోన్​ చేయవని, అలాంటి కాల్స్​కు స్పందించకూడదని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా సైబర్ క్రైమ్ టీం ఉపేందర్ రావు, పాలెం యూనివర్సిటీ విద్యార్థులు  పాల్గొన్నారు.