వంద శాతం పెండింగ్ కలెక్షన్లు పూర్తి చేయండి : కర్నాటి వరుణ్​రెడ్డి

వంద శాతం పెండింగ్ కలెక్షన్లు పూర్తి చేయండి : కర్నాటి వరుణ్​రెడ్డి
  • టీజీఎన్​పీడీసీఎల్​సీఎండీ కర్నాటి వరుణ్​రెడ్డి ఆదేశం

హనుమకొండ, వెలుగు: సర్కిళ్లలో పెండింగ్ కలెక్షన్లు నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని టీజీఎన్​పీడీసీఎల్​ సీఎండీ కర్నాటి వరుణ్​రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి గురువారం సంస్థ పరిధిలోని16 సర్కిళ్ల ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించి మాట్లాడారు. సర్కిళ్ల పరిధిలో డివిజన్, సెక్షన్ల వారీగా  సమావేశాలు ఏర్పాటు చేసుకొని కలెక్షన్లు పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ చోరీని అరికట్టాలని, రైతులు మోటార్లకు కెపాసిటర్స్ పెట్టుకునేలా అవగాహన కల్పించాలని, వాటితో కలిగే లాభాలను వివరించాలని పేర్కొన్నారు. 

కేబుల్ ఆపరేటర్ల వైర్లు కట్టిన విద్యుత్ స్తంభాలకు రెంటల్ వసూళ్లు చేయాలని ఆదేశించారు. పోల్ పై వైర్లు ఉండటంతో ఏవైనా రిపేర్లు చేయాలం టే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకు పరిష్కారంగా లైన్ పై ఒక క్రమపద్ధతిలో వైర్లు పెట్టుకునేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్​చార్జ్ డైరెక్టర్ వి .తిరుపతి రెడ్డి, సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.