
హైదరాబాద్సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను మరోసారి అధికారులు వేలం వేస్తున్నారు. జేబీఎస్ లోని ప్లాట్ఫారం నెం.14 పక్కన ఉన్న కార్గో కార్యాలయంలో ఈ నెల14 నుంచి 16 వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం నిర్వహించనున్నారు. ఎవరైనా నేరుగా వచ్చి వేలం పాటలో పాల్గొనవచ్చని గ్రేటర్ హైదరాబాద్జోన్ అసిస్టెంట్ట్రాఫిక్ మేనేజర్ఇషాక్బిన్మహ్మద్తెలిపారు.
పార్శిల్ వ్యాల్యూపై 50 శాతం తగ్గించి వేలం వేస్తామని, ఈసారి మొత్తం 350 ఉత్పత్తులను వేలం వేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఆటోమొబైల్స్ఐటమ్స్ 40, ఎలక్ట్రికల్ఐటమ్స్35, సాలిడ్ఐరన్ 30, గృహోపకరణాలు 10, స్టేషనరీ 5, ఇండస్ట్రియల్స్పేర్స్10, జనరల్ ఐటమ్స్220 ఉన్నాయన్నారు.