హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్ల కోసం డీఆర్డీవో తయారు చేసిన 2 డీజీ డ్రగ్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే రకరకాల ట్రయల్స్పూర్తి చేసుకున్న ఈ మందు వారంలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నీళ్లలో కలుపుకొని తాగే ఈ డ్రగ్ సాచెట్ రేటు రూ. 500 నుంచి రూ. 600 వరకు ఉండొచ్చని అంటున్నారు. తాజాగా కొన్ని హాస్పిటల్స్, డాక్టర్లకు డ్రగ్ శాంపుల్ సాచెట్స్ అందించారు.
ఏంటీ ఈ 2డీజీ
2 డీజీ (2- డీఆక్సీ- డీ -గ్లూకోజ్) మాడిఫైడ్ గ్లూకోజ్. చక్కెర లాంటి పదార్థాల్లో ఉండే గ్లూకోజ్ మాలిక్యూల్లో చిన్న మార్పు చేసి దీన్ని తయారు చేస్తారు. క్యాన్సర్ పేషెంట్లలో సెల్ గ్రోత్ లేకుండా చూసేందుకు దీన్ని వాడతారు. 2 డీజీ మాలిక్యూల్స్శరీరంలోకి వెళ్లాక సెల్స్ (కణం)లోకి ఎంటరవుతుంది. తర్వాత ఎనర్జీ విడుదల చేసేందుకు జరిగే గ్లైకాలసిస్ ప్రాసెస్ని 2డీజీ మాలిక్యూల్ పూర్తిగా నియంత్రిస్తుంది. దీంతో సెల్స్లో ఎనర్జీ ఉత్పత్తి కాదు. ఎనర్జీ ఉత్పత్తి అయ్యే క్రమంలో అవసరమయ్యే ఆక్సిజన్ అవసరం ఉండదు. కణాల విభజన జరగదు. దీంతో వైరస్వ్యాప్తి కంట్రోల్అవుతుంది. ఎనర్జీ ఉత్పత్తి కాదు గనుక ఆక్సిజన్అవసరం తగ్గుతుంది. మాడరేట్ నుంచి సివియర్ లక్షణాలున్న పేషెంట్లకు ఈ మందు ఇవ్వగా వాళ్లలో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గిందని, త్వరగా కోలుకున్నారని డాక్టర్లు గుర్తించారు.
ఎట్లా మొదలైంది?
డీఆర్డీవోకు అనుబంధంగా ఇనిస్టిట్యూట్ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐఎన్ఎంఏఎస్) సంస్థలో పని చేసే సైంటిస్టుల ఆలోచన ఇది. క్యాన్సర్పేషంట్ల కోసం చేస్తున్న పరిశోధనలు కరోనా వాళ్లకు ఈ మందు ఎందుకు ఉపయోగపడదు అనే ఆలోచన వచ్చింది. దీంతో ప్రాథమిక ప్రయోగాలు మొదలుపెట్టారు. కరోనా తొలి వేవ్లో గతేడాది ఏప్రిల్లో ఫేజ్-1 ట్రయల్ మొదలుపెట్టారు. రిజల్ట్ సంతృప్తికరంగా రావడంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ఆర్గనైజేషన్(సీడీఎస్సీవో)ను అనుమతి కోరారు. మే నెలలో సెకండ్ ఫేజ్ ట్రయల్కు సీడీఎస్సీవో అనుమతిచ్చింది. దీంతో రెండు దశల్లో 11 హాస్పిటళ్లలో 110 మంది పేషెంట్లపై ట్రయల్స్ చేశారు. నవంబర్లో మూడో ఫేజ్కు అనుమతి వచ్చింది. 2020 డిసెంబర్ నుంచి 2021 మార్చి వరకు దేశవ్యాప్తంగా 27 హాస్పిటళ్లలో 220 మంది పేషెంట్లపై 2డీజీని ప్రయోగించారు. అన్నీ సక్సెస్ కావడంతో 2021 మే 1న డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఎమర్జెన్సీ యూజ్ కింద వాడేందుకు అనుమతినిచ్చింది. సీసీఎంబీతో కలిసి తొలి దశ ప్రయోగాలు నిర్వహించిన డీఆర్డీవో ఇండస్ట్రియల్పార్టనర్గా రెడ్డీస్ల్యాబొరేటరీస్తో ఒప్పందం చేసుకుంది. దీంతో రెడ్డీస్ ల్యాబ్స్ 2 డీజీ ఉత్పత్తిని మొదలుపెట్టింది. ముందు ఓ 10 వేల సాచెట్లతో మొదలుపెట్టి భారీ స్థాయిలో ప్రొడక్ట్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
అన్ని వయసుల వారికీ పని చేస్తుంది
2 డీజీ నీళ్లలో కలుపుకొని తాగే పౌడర్ కాబట్టి తీసుకోవడం తేలిక. ఈ డ్రగ్ తీసుకున్న పేషెంట్లలో రెండు మూడ్రోజుల్లోనే తేడా కనిపించిందని సైంటిస్టులు అంటున్నారు. ‘ఒక పేషెంట్5 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే, 2 డీజీ తీసుకుంటే అది రెండు, మూడు రోజులకు తగ్గుతుంది’ అని డీఆర్డీవో డైరెక్టర్సతీశ్రెడ్డి తెలిపారు. అన్ని వయసుల వారికీ ఇది పనిచేస్తుందన్నారు. తమ ట్రయల్స్ లో 65 నుంచి 75 ఏళ్ల వాళ్లలోనూ మంచి ఫలితం కనిపించిందని చెప్పారు. 2 డీజీని మిగతా కరోనా ట్రీట్మెంట్లో భాగంగా వాడతారు. అందుకే దీన్ని థెరపెటిక్ మెడిసిన్ అంటున్నారు. వారం పాటు రోజుకు రెండు పూటలు వాడాల్సిన అవసరం ఉంటుందేమోనని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
2 డీజీతో మంచి రిజల్ట్స్
‘కరోనా పేషెంట్లలో 2డీజీ మంచి ఫలితాలిస్తోంది. మా డిఫెన్స్ సైంటిస్టులు దీనిపై బాగా పరిశోధన చేశారు. క్లినికల్ట్రయల్స్లోనూ మంచి ఫలితం కనిపించింది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్లతో పాటు ఆక్సిజన్పై ఉన్న పేషెంట్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పేషెంట్ల శరీరంలో ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించడం, వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవడానికి ఈ 2 డీజీ అణువులు బాగా ఉపయోగపడతాయి. రెడ్డీస్ ల్యాబ్స్ ముందు ఓ 10 వేల సాచెట్లు తయారు చేస్తుంది. వారంలో సాచెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తాం’
- జి. సతీశ్రెడ్డి, డైరెక్టర్, డీఆర్డీవో