- సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
- నివేదిక రెడీ చేస్తున్న కరీంనగర్ కలెక్టర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ ప్రకటించిన దళిత బంధు పథకంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ పథకాన్ని హుజూరాబాద్లో అమలు చేస్తామనడంపై అనేక కంప్లయింట్స్వస్తున్నాయని తెలిపింది. ప్రధానంగా ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లెటర్ను ప్రస్తావించింది. అసలు ఈ పథకం కొత్తదా? పాతదా? ఇప్పుడే అమలు చేస్తున్నారా? ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకే తెచ్చిన పథకమా? తదితర వివరాలతో పూర్తి రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) శశాంక్ గోయల్ ను ఈసీ ఆదేశించింది. ఈసీ ఆర్డర్స్ మేరకు వెంటనే దళిత బంధుపై రిపోర్టు ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ ను సీఈఓ ఆదేశించారు. దళిత బంధుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల ఈసీకి కంప్లయింట్ చేసింది. ఈ స్కీమ్ ను స్వాగతిస్తున్నామని, అయితే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు హుజూరాబాద్ లో స్కీమ్ ను అమలు చేయకుండా ఆపాలని కోరింది.