వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్ : కరోనా వాక్సిన్ సరఫరాకు కోల్డ్ చైన్ సిస్టమ్ తో సిద్దంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. కరోనా వాక్సిన్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ముందుగా ఎవరికి ఇవ్వాలనే దానిపై కోల్డ్ చైన్ సిస్టమ్ రూపొందించామని.. ఈ సిస్టమ్ ప్రకారం అందరికీ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ముందుగా కరోనా వారియర్స్ గా పనిచేసిన వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పోలీసులకు, బస్తీ వాసులకు వాక్సిన్ అందిస్తామని ఆయన వివరించారు. ప్రాధాన్యత క్రమం ప్రకారం అందరికీ వ్యాక్సిన ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఈటెల వెల్లడించారు.