సింగరేణిలో క్వార్టర్ల  డిజిటలైజేషన్

సింగరేణిలో క్వార్టర్ల  డిజిటలైజేషన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలోని ప్రతి క్వార్టర్​ వివరాలను డిజిటలైజేషన్​ చేస్తున్నామని కంపెనీ డైరెక్టర్​ ఎన్​. బలరాం తెలిపారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్​ ఆఫీస్​లో డిజిటలైజేషన్​ ప్రక్రియకు డైరెక్టర్​ సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న మొత్తం క్వార్టర్ల వివరాలను పొందుపరుస్తున్నామన్నారు. ఒక్కో ఉద్యోగి పేర ఎన్ని క్వార్టర్లు ఉన్నాయో తెలుస్తోందన్నారు.

మెడికల్​ అన్​ఫిట్​ కోసం దరఖాస్తులు, సీనియార్టీ వివరాలను ఎస్​ఏపీలో డిజిటలైజేషన్​ చేస్తున్నామన్నారు. ప్రోగ్రాంలో జీఎం పర్సనల్​ బసవయ్య, అధికారులు హరప్రసాద్​, వేణు, గట్టు స్వామి, సుశీల్, అనిల్, ప్రవీణ్, శివ కుమార్​ పాల్గొన్నారు.