
ఒక్క ఐడీకి 5 సిమ్లు మాత్రమే
కేవైసీ పద్ధతి పూర్తిగా డిజిటలైజేషన్
న్యూఢిల్లీ : నకిలీ సిమ్ కార్డులను అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ (డాట్) నో యువర్ -కస్టమర్ (కేవైసీ) పద్ధతిలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. నేషనల్ మీడియాలో వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఒక ఐడీపై ఇప్పుడు తొమ్మిది సిమ్ కార్డ్లు ఇస్తుండగా, ఇక నుంచి వీటి సంఖ్యను ఐదుకి తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కేవైసీ పద్ధతిని పూర్తి డిజిటలైజ్చేస్తారు. ప్రస్తుతం యూఐడీఏఐ నుండి తీసుకున్న ఫొటోతో పాటు కస్టమర్ ఆధార్ వివరాలతో ఈ–కేవైసీ పూర్తి చేసి సిమ్కార్డు ఇస్తున్నారు.
ఈ విధానానికి బదులు సెల్ఫ్–కేవైసీ పద్ధతి రానుంది. ఈ విధానంలో కస్టమర్ ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్తో సర్వీస్ ప్రొవైడర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం కుటుంబం / బంధువులు / తెలిసిన వ్యక్తుల మొబైల్ నంబర్ను కూడా ఉపయోగించవచ్చు. సంబంధిత మొబైల్ నంబర్కు ఓటీపీ పంపడం ద్వారా కస్టమర్ వివరాలను వెరిఫై చేస్తారు. ఎలక్ట్రానిక్గా వెరిఫై చేసిన పీఓఐ/పీఓఏ డాక్యుమెంట్లను మాత్రమే సబ్స్క్రైబర్ వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగిస్తే, కస్టమర్ల నుంచి డిక్లరేషన్ తీసుకుంటారు.