
వికారాబాద్, వెలుగు: వికారాబాద్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పర్యటించారు. అనంతగిరిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హరిత హోటల్ను పైలెట్ ప్రాజెక్ట్గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రతీక్ జైన్కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం పూడూరు మండలంలోని బృందావనం స్పిరిట్స్ డిస్టిలరీని తనిఖీ చేశారు.