నీట్ పీజీ ఎగ్జామ్​ షెడ్యూల్ ప్రకారమే

నీట్ పీజీ ఎగ్జామ్​ షెడ్యూల్ ప్రకారమే

ఢిల్లీ : నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల పరీక్షను జులై 9కి వాయిదా వేశారని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరిట ఓ నకిలీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్రమత్తమైన ప్రభుత్వం .. అవన్నీ తప్పుడు వార్తలని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మే 21 న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.  ఎన్బీఈఎమ్ఎస్ తన అధికారిక వివరాలను  https://natboard.edu.in  వెబ్ సైట్ లో మాత్రమే ఉంచుతుందని తెలిపింది. వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. తప్పుడు వార్తలపై క్రాస్ వెరిఫై చేసుకోవాలని కోరింది.