సంగారెడ్డి, వెలుగు: గ్రామీణ ప్రాంత మహిళలకు వచ్చే రొమ్ము, సర్వైకల్క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ ఫర్ఎలిమినేషన్ఆఫ్రూరల్పావర్టీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్తాధ్వర్యంలో బుధవారం సంగారెడ్డిలోని ఎస్ఎస్ గార్డెన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉచిత స్క్రీనింగ్పరీక్షలు, వైద్య సలహాలు అందిస్తామని తెలిపారు. క్యాన్సర్పైన భయాలు, అపోహలు తొలగించి మహిళల్లో ధైర్యం నింపడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టర్ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా 13 పీహెచ్ సీలను ఆరోగ్య మహిళా పీహెచ్సీలుగా గుర్తించామ న్నారు. అక్కడ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మొబైల్మెడికల్క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో గ్రాన్యూల్స్ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి, ఏఐజీ హాస్పిటల్అంకాలజిస్ట్, యూసీ బ్రెస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి, డీఆర్డీఏ అధికారులు, ఎస్హెచ్జీ గ్రూప్సభ్యులు పాల్గొన్నారు.
