బార్బడోస్పై భారత మెన్స్ టేబుల్ టెన్నీస్ టీమ్ విజయం

బార్బడోస్పై భారత మెన్స్ టేబుల్ టెన్నీస్ టీమ్ విజయం

కామన్వెల్త్ గేమ్స్ను  భారత మెన్స్ టేబుల్ టెన్నీస్ టీమ్ గెలుపుతో ఆరంభించింది.  గ్రూప్ -3లో భాగంగా బార్బడోస్పై జరిగిన మ్యాచ్లో భారత జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. హర్మీత్ దేశాయ్, సత్యన్ జ్ఞానశేఖరన్‌ల డబుల్స్ జట్టు.. కెవిన్ ఫర్లే, టైరీస్ నైట్ ద్వయంపై గెలిచింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్లో తొలి గేమ్ను 11-9తో కష్టంగా నెగ్గింది. ఆ తర్వాత రెండో గేమ్లోనూ 11-9తో విజయం సాధించింది. చివరిదైన మూడో గేమ్లో మాత్రం ప్రత్యర్థిపై జోరు కనభర్చింది.  ఆ గేమ్ను 11-4తో  గెలిచిన టీమిండియా..మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 

అటు ఆచంట శరత్ కమల్, రామన్ మాక్స్ వెల్ మధ్య జరిగిన సింగిల్స్  మ్యాచ్ లో శరత్ కమల్ విజయం సాధించాడు. రామన్ మాక్స్వెల్ ను  11-5, 11-3, 11-3 తేడాతో ఓడించాడు. అనంతరం  సత్యన్ జ్ఞానశేఖరన్, టైరీస్ నైట్ మధ్య జరిగిన మ్యాచ్ లో సత్యన్ గెలుపొందాడు. 11-4, 11-4, 11-5 తేడాతో గెలిచి భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టాడు.