
కర్నాటక ఫలితాలతో బీఆర్ఎస్ డీలా
జేడీఎస్ను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పాలనుకున్న గులాబీ బాస్
కింగ్ మేకర్గా కుమారస్వామి మారుతారని ఎన్నో ఆశలు
రిజల్ట్స్కు ముందే హైదరాబాద్ స్టార్ హోటళ్లలో రూముల బుకింగ్
తీరా కాంగ్రెస్కు ఏకపక్ష విజయం దక్కడంతో హైరానా
37 నుంచి 19 సీట్లకు పడిపోయిన కుమారస్వామి పార్టీ
హైదరాబాద్, వెలుగు : కర్నాటక ఎన్నికల ఫలితాలు కేసీఆర్కు షాక్ ఇచ్చాయి. కుమారస్వామి పార్టీ జేడీఎస్ను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పాలని భావించిన ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాదని, హంగ్వస్తే కింగ్మేకర్గా కుమారస్వామి అవుతారని కేసీఆర్ ముందు నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశారు. రిజల్ట్స్కు ముందే హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో జేడీఎస్ ఎమ్మెల్యేలతో క్యాంపు పెట్టి బేరసారాలు చేయాలని చూశారు. తీరా కర్నాటక ప్రజలు కాంగ్రెస్కు ఏకపక్ష విజయం కట్టబెట్టడంతో బీఆర్ఎస్ డీలా పడింది. కన్నడ ఫలితాల ప్రభావం తెలంగాణపైనా పడుతుందని హైరానా చెందుతున్నది. శనివారం మధ్యాహ్నం వరకే ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చినా సాయంత్రం వరకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఎన్నో ప్రయత్నాలు చేసి..!
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని కేసీఆర్ ప్రకటించారు. జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని సీఎం చేయడమే తమ లక్ష్యమని కూడా చెప్పారు. తీరా ఎన్నికల షెడ్యూల్వచ్చాక వ్యూహత్మకంగానే ఆయన దూరంగా ఉన్నారు. తెరచాటున జేడీఎస్కు అండగా నిలుస్తూ వచ్చినట్లు ప్రచారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రభావం కళ్యాణి కర్నాటకపై ఎక్కువగా ఉందని, అక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లలో జేడీఎస్ను గెలిపించాలని కేసీఆర్ఎత్తులు వేస్తూ వచ్చారు. మొదట ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలని అనుకున్నా.. అది ఇతర పార్టీలు గెలిచేందుకు దోహదం చేస్తుందని ఆ ప్రయత్నాలను కేసీఆర్ మానుకున్నారు.
టీఆర్ఎస్పేరును బీఆర్ఎస్గా మార్చే క్రమంలో ప్రతి అడుగులో తన వెంటే ఉన్న కుమారస్వామిని కర్నాటక ఎన్నికల్లో గట్టెక్కించాలని కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. పలు సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్పోల్స్కూడా కేసీఆర్అంచనాలకు దగ్గరగా ఉండటంతో కుమారస్వామి కింగ్మేకర్ అవుతారని బీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. శనివారం కర్నాటక ఎన్నికల రిజల్ట్స్ఉండటంతో శుక్రవారమే నగరంలోని తాజ్కృష్ణాలో 18, పార్క్హయత్లో 20, నోవాటెల్లో 20 సూట్లు బుక్చేశారు. ఈ రూముల్లో జేడీఎస్ఎమ్మెల్యేలను పెట్టి చక్రం తిప్పాలని చూశారు. కానీ, కేసీఆర్ ఒకటి తలిస్తే కర్నాటక ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు.
సొంత నేతలు చేజారకుండా..!
ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా 2014 నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, నేతలను బీఆర్ఎస్ చేర్చుకుంటూ వస్తున్నది. ఫలితంగా గులాబీ పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగాయి. ఇప్పుడు పొరుగు రాష్ట్రం కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్లో టికెట్రాదనే నిర్ణయానికి వచ్చిన నేతలంతా కాంగ్రెస్ వైపు చూసే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. కన్నడ ఓటర్లు ఇచ్చిన బూస్టింగ్తో కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీ నేతలకు ఆకర్ష్వల విసిరితే ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ ఏడాది నవంబర్నెలాఖరులోపే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇక్కడా ఎంతో కొంత పడుతుందని ప్రగతి భవన్క్యాంపు లెక్కలు వేసుకుంటున్నది. ఎక్కడెక్కడ కాంగ్రెస్కు లబ్ధి చేకూరొచ్చు.. ఎక్కడెక్కడ తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చు.. అని బీఆర్ఎస్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. కర్నాటకలో తమ అంచనాలు బెడిసికొట్టడంతో కొన్నాళ్లపాటు సైలెంట్గా ఉండటమే బెటర్అనే భావనలో గులాబీ బాస్ఉన్నట్టు తెలుస్తున్నది.
కింగ్ మేకర్ కాదు కదా.. ఉన్న సీట్లలో 18 పోయినయ్
జేడీఎస్సొంతగా పోటీ చేసి 2018లో 37 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్మీటింగుల్లో కేసీఆర్ వెంటే కుమారస్వామి వరుసగా కనిపించడంతో జేడీఎస్పార్టీ బీఆర్ఎస్కు బీ టీం అనే ప్రచారం సాగింది. మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఇదే లైన్ను జనంలోకి తీసుకెళ్లారు. కేసీఆర్వెనుకుండి కుమారస్వామిని నడిపిస్తున్నారని వారు జనానికి చెప్తూ వచ్చారు. ఈ ప్రభావం మైసూర్ప్రాంత ఓటర్లపై ఎక్కువగా పడటంతో జేడీఎస్తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణలోని తమ పథకాల ప్రభావంతో కళ్యాణి కర్నాటకలో జేడీఎస్ ఎక్కువ సీట్లు గెలువొచ్చన్న కేసీఆర్అంచనాలు తలకిందులయ్యాయి.
మొత్తంగా గత ఎన్నికలతో పోలిస్తే 18 సీట్లను చేజార్చుకొని 19 సీట్లకే జేడీఎస్పరిమితిమైంది. ‘‘కర్నాటక ఎమ్మెల్యే సీట్లు మీకు.. ఎంపీ సీట్లు మాకు’’ అన్న అవగాహనతో కుమారస్వామితో ముందుకుసాగిన గులాబీ బాస్ ఆశలకు కర్నాటక ప్రజలు ఆదిలోనే గండి కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్బోల్తా పడటంతో ఇక అక్కడ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, జేడీఎస్ప్రభావం ఎంతమేరకు ఉంటుందని, కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్థానం ఏ రకంగా సాగుతుందోనన్న చర్చ కూడా మొదలైంది.