‘ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని అనుకోకుండా తప్పక చూడండి’

‘ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని అనుకోకుండా తప్పక చూడండి’

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” కి లైన్ క్లియర్ అయింది.  మొదటి నుంచి పలు వివాదాలను ఎదుర్కొంటున్న ఈ సినిమాపై తెలంగాణ హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం, రివ్యూ క‌మిటీ నిర్ణయంతో..  సెన్సార్ బోర్డు సినిమాకు `యు/ఎ` స‌ర్టిఫికేట్ ఇచ్చింది.

ఈ విష‌యాన్ని రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. `అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌ బిడ్డలు` ఆపడానికి ప్రయత్నించిన ప్రతిఒక్కరికీ బాడ్ న్యూస్. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ వచ్చింది. అనుకున్న ప్రకారం ఈ సినిమా డిసెంబర్‌ 12న విడుదల కానుంది. కొందరు జోకర్లు, కన్నింగ్‌ వ్యక్తులు సినిమా విడుదలను ఆలస్యం చేసినప్పటికీ భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్చను ఆపలేకపోయారు’ అంటూ ట్వీట్‌ చేశాడు.

మరో ట్వీట్ లో ‘ “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” రెండు కులాల మధ్య గొడవ పెట్టే సినిమా కాదు … ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని అనుకోకుండా తప్పక చూడండి .. రేపే విడుదల’ అంటూ తన స్టైల్ లో పోస్ట్ పెట్టాడు