
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే చాన్స్ను మహానటి కీర్తి సురేశ్ కొట్టేసింది. దీపికా, శింబుతో ఓ తమిళ సినిమా చేయడానికి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనే వార్తలు వినిపించాయి. అంతేకాదు కొన్ని కండీషన్స్ కూడా పెట్టిందట. దీంతో ఖంగుతిన్న మేకర్స్.. ఆమె స్థానంలో కీర్తి సురేశ్ను ఒకే చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మరో బాలీవుడ్ నటిని కూడా ఎంపిక చేశారట.
కోలీవుడ్ నుంచి తెలుగు పరిశ్రమకు పరిచయమైన కీర్తి మహానటితో ఇక్కడ స్టార్ డంను దక్కించుకుంది. ఇక చాలాకాలం తరువాత మళ్లీ ఇప్పుడు తమిళంలో బిజీగా మారనుంది. ఇప్పటికే శివకార్తికేయన్, ధనుష్ తో చేసిన సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. ఇటీవల శింబు నటించిన ఓ సినిమా తమిళ నాట మంచి హిట్టందుకుంది. దీంతో కీర్తి కూడా ఈ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక తెలుగులో ఈ మధ్యే నాని దసరా సినిమాతో సక్సెస్ కొట్టిన కీర్తి.. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ లో నటిస్తోంది. ఇందులో ఆమె చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది.