- సికింద్రాబాద్ డీఎంహెచ్ ఆఫీసు ముందు ఆశావర్కర్ల ఆందోళన
సికింద్రాబాద్, వెలుగు: జీతాలు పెంచాలని పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సీఐటీయూ నాయకులతో కలిసి బుధవారం సికింద్రాబాద్లోని డీఎంహెచ్ వో ఆఫీసు ముందు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. కరోనా టైమ్లో డాక్టర్లు, సిబ్బందితో సమానంగా ఆశా వర్కర్లు పేషెంట్లకు సేవలు అందించారన్నారు. రోజుకి 8 గంటలకు పైగా పనిచేస్తున్నా.. వీరికి జీతం తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం సిటీలో 2 వేలకు పైగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, రోజు రోజుకి వారికి పనిభారం ఎక్కువవుతున్నా జీతాలు పెరగడం లేదన్నారు. ఆశా వర్కర్లకు నెలకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వడంతో పాటు టీఏ, డీఏలు, వారాంతపు సెలవులు, పీఆర్సీని అమలుచేయాలన్నారు.