వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉందని చెబుతూ సోమవారం రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 29న సినిమాని విడుదల చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
‘ఉప్పెన’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్.. ‘పెళ్లి సందD’ చిత్రంతో యూత్ని ఎట్రాక్ట్ చేసిన శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందన్నారు దర్శక నిర్మాతలు. ఇందులో వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ గెటప్లో కనిపించనున్నట్టు చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ను ప్రకటిస్తామన్నారు.