V6 News

మిస్టికల్ థ్రిల్లర్‌‌‌‌ పోచమ్మ.. ఏప్రిల్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..

మిస్టికల్ థ్రిల్లర్‌‌‌‌ పోచమ్మ.. ఏప్రిల్ 17 నుంచి ఆహాలో  స్ట్రీమింగ్..

అంబటి అర్జున్, శ్రీపూజ, స్నేహల్ కామత్ కీలక పాత్రల్లో నటించిన వెబ్‌‌ సిరీస్‌‌ ‘పోచమ్మ’.  రమేష్ ఇంద్ర దర్శకత్వంలో శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్‌‌‌‌గా వస్తోన్న ఈ సిరీస్‌‌ శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్  అవుతోంది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో అంబటి అర్జున్ మాట్లాడుతూ ‘కొన్ని కంటెంట్‌‌లు ముందు  సైలెంట్‌‌గా ఉంటాయి, కానీ రిలీజ్ అయ్యాక మంచి సౌండింగ్ చేస్తాయి. ఈ సిరీస్  కూడా అలాంటిదే.   పోస్టర్, టైటిల్‌‌తోనే మా సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. సిరీస్ కూడా  కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు.  

జెస్సీ క్యారెక్టర్‌‌‌‌తో అలరిస్తానని స్నేహల్ కామత్ చెప్పింది. ఈ సిరీస్ తప్పకుండా సక్సెస్ అవుతుందనే  నమ్మకం ఉందని శ్రీ పూజ చెప్పింది. పోచమ్మ తల్లే తమను నడిపించిందని   ఆహా  కంటెంట్ హెడ్ కవిత అన్నారు.