హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు.
Also Rard: గణేష్ ఉత్సవాలు..ఖైరతబాద్ రూట్లలో వాహనాలకు అనుమతి లేదు
సిబ్బంది జెండాను తలకిందులుగా (ఆకుపచ్చ రంగు పైకి.. కాషాయం రంగు కిందికి) కట్టగా.. పోచారం అలాగే జెండాను ఎగుర వేసి వందనం చేశారు. పోలీస్సిబ్బంది జెండాకు గౌరవ వందనం చేశారు. అలాగే జనగణమన ఆలపించారు. ఆ తర్వాత జరిగిన పొరపాటును గుర్తించి జెండాను సరి చేసి మళ్లీ ఎగురవేశారు. మండలి ఆవరణలో చైర్మన్గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.