పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి

పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి
  • రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ 

ఖైరతాబాద్, వెలుగు: ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్ రాజ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేబీ రాజు, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతోనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. ఆయన ఆలోచనలను, ఆశయాలను మరితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. గద్దర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని పంజాగుట్ట చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వీహెచ్ నాలుగేండ్లుగా పోరాటం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా విగ్రహన్ని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో వి.హనుమంతరావు, ఆప్ నేత ఇందిరా శోభన్, వైఎస్సార్ టీపీ ప్రతినిధి డానియల్ తదితరులు పాల్గొన్నారు.