
న్యూఢిల్లీ : ఆఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ ఈ నెల 22 న ఓపెన్ కానుంది. మే 27 న ముగుస్తుంది. మే 21న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఓపెన్లో ఉంటుంది. ఒక్కో షేరుని రూ. 364–383 రేంజ్లో అమ్ముతున్నారు.
ఈ ఇష్యూ ద్వారా రూ. 599 కోట్లను సేకరించాలని ఆఫిస్ చూస్తోంది. ఈ ఐపీఓలో రూ.128 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను ఇష్యూ చేయనుండగా, షేర్ హోల్డర్లు ఓఎఫ్ఎస్ కింద రూ.471 కోట్ల విలువైన 1.23 కోట్ల షేర్లను అమ్మనున్నారు.