
- 7,109 సెంటర్లలో కొనసాగుతున్న కొనుగోళ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు సెంటర్లలో ఇప్పటి వరకు 6.67లక్షల టన్నుల వడ్ల సేకరణ జరిగింది. సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో 7,109 సెంటర్లను ప్రారంభించింది. 1,01121 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించింది. తాజాగా రాష్ట్రమంతటా అకాల వర్షాలు పడుతుండటంతో సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కొనుగోలు సెంటర్లలో టార్పాలిన్లు అందుబాటులోకి తెచ్చి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.