జ్యోతినగర్, వెలుగు: ఎన్టీపీసీ నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (టీఎస్టీపీపీ) 800 మెగా వాట్ల ఒకటో యూనిట్లో ఆదివారం రాత్రి 8గంటల ప్రాంతంలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. మార్చి 25న ఒకటో యూనిట్ నిర్మాణం పూర్తికాగా ఉత్పత్తి ప్రారంభించారు. టెక్నికల్ ఇష్యూతో వారం రోజుల తర్వాత ఉత్పత్తి నిలిచి పోయింది. వాటిని గుర్తించి 3 నెలల తర్వాత ఈ నెల 19 బాయిలర్ ను వెలిగించారు. ఈ క్రమంలో ఒకటో యూనిట్లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టగా విజయవంతమైంది.
దీంతో ఆఫీసర్లు, సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. ప్రాజెక్ట్ సీజీఎం కేదార్ రంజన్ పాండ్ స్వీట్లు పంపిణీ చేశారు. పూర్తి స్థాయి కమర్షియల్ డిక్లరేషన్ ఈనెల 28 లోపు చేసేందుకు ఆఫీసర్లు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టులో రెండో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రానికే అందనుంది.