సంగారెడ్డిలో చిక్కిన చిరుత.. జూకు తరలింపు

సంగారెడ్డిలో చిక్కిన చిరుత.. జూకు తరలింపు

సంగారెడ్డి జిల్లా: జిన్నారంలోని హెటిరో ల్యాబ్లో చొరబడిన పులిని రెస్క్యూ సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. ఉదయం హెచ్ బ్లాక్లోని రియాక్టర్ రూమ్లోకి చిరుత పులి చొరబడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం పులిని పట్టుకున్నారు. దానిని జూకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు పులి పట్టుపడడంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 

జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో శుక్రవారం పులి కనిపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల భయాందోళనకు గురయ్యారు. హెటిరో ల్యాబ్ పరిశ్రమలోకి ప్రవేశించడం గమనించి కార్మికులు పరుగులు పెట్టారు. సీసీ కెమెరాలో చిరుత పులి సంచారం స్పష్టంగా కనిపించింది. హెచ్ బ్లాక్ లో నక్కి ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చారు. వారు మూడు గంటలకుపైగా కష్టపడి చిరుతను పట్టుకున్నారు.