- సీఎస్ , సీఎంవో ప్రిన్సిపల్సెక్రటరీ తయారు చేసిన లిస్ట్ పక్కకి
- కొత్త లిస్ట్రెడీ చేస్తున్న ఆ ముగ్గురు మంత్రులు
- తమకు అనుకూలంగా పనిచేసే వారికే కలెక్టర్ పోస్టింగ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐఏఎస్ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ల బాధ్యత సీఎస్, సీఎంవో నుంచి మంత్రుల చేతుల్లోకి వెళ్లింది. ఎలక్షన్ఇయర్ కావడంతో తమకు అనుకూలంగా పనిచేసే ఆఫీసర్లకే కలెక్టర్పోస్టింగ్లు ఇవ్వడంతో పాటు.. సెక్రటేరియెట్హెచ్వోడీ పోస్టులు కట్టబెట్టే ప్లాన్చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రెడీ చేసిన లిస్ట్ ను పక్కన పెట్టి.. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డికి ఆ టాస్క్ను సీఎం కేసీఆర్అప్పగించినట్లు తెలిసింది. ఈ కారణంగానే 10 రోజుల నుంచి ఊరిస్తున్న ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ముగ్గురు మంత్రులు ఏ ఐఏఎస్ఎక్కడ ఉండాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు ఐఏఎస్లు వారిని కలుస్తూ తమకు ఫలానా చోట పోస్టింగ్ఇవ్వాలని రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్సదస్సు నిర్వహించనున్నట్లు తెలిసింది.
ఇప్పుడిస్తేనే అప్పటికి ఇబ్బంది ఉండదని
షెడ్యూల్ ప్రకారం అయితే రాబోయే సంవత్సరంలో నవంబర్ లేదా డిసెంబర్లో జనరల్ఎలక్షన్స్ జరగాలి. అయితే, అంతకు ముందే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హడావుడి నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు తెరపైకి వచ్చాయి. జిల్లాల్లో కొంతమంది కలెక్టర్ల పదవీకాలం మూడేండ్లు దాటిపోయింది. కొంతమంది ఐఏఎస్లు పోస్టింగ్లు లేకుండా వెయిటింగ్లో ఉన్నారు. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాల్సివస్తే.. అంతకంటే మునుపే ఐఏఎస్ల బదిలీలు పూర్తి చేసుకుంటే ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ఈసీ నిబంధనల ప్రకారం ఎలక్షన్స్ జరిగే కంటే ముందు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న వాళ్లు మూడేండ్లకు మించకూడదు. దీంతో ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు సర్కార్కు తప్పనిసరి అయిపోయింది. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు పూర్తి స్థాయి కలెక్టర్ లేరు. సీఎస్తో సహా మరో నలురుగు ఐఏఎస్ ఆఫీసర్లు రెండు, మూడు డిపార్ట్మెంట్లకు ఒక్కరే ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు.
తెలంగాణ ఐఏఎస్లకు ప్రియారిటీ దక్కేనా
రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రాంత ఐఏఎస్లు సీనియర్లుగా ఉన్నా.. వారిని లూప్లైన్కే పరిమితం చేస్తున్నారు. ఏండ్ల తరబడి అలాగే కొనసాగిస్తున్నారు. ఈసారైనా మంచి పోస్టులు వస్తాయేమోనని ఆశిస్తున్నారు. సీఎంవోలో ఒక్క దళిత ఐఏఎస్ ఉన్నారా? అని అప్పట్లో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ప్రశ్నించడంతో.. ప్రభుత్వం రాహుల్ బొజ్జాను సీఎంవోలోకి తీసుకుంది. బుర్రా వెంకటేశం లాంటి సీనియర్ ఐఏఎస్ను నిధులు ఇవ్వకుండా బీసీ వెల్ఫేర్కు పరిమితం చేసింది. ఆకునూరి మురళీ ముందస్తుగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. కిషన్ లాంటి ఐఏఎస్లు నామ్కే వాస్తేగా ఉన్న పోస్టుల్లోనే రిటైర్అవుతున్నారు.
రెడీ అయిన లిస్ట్ పక్కన పెట్టిన్రు
భారీగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు అని గత నెల 20వ తేదీ నుంచే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారం నవంబర్25వ తేదీనే సెక్రటేరియెట్లో బదిలీల జీవోలు రావాల్సి ఉంది. సీఎస్, సీఎం ప్రిన్సిపల్సెక్రటరీ కలిసి ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఇవ్వాలనే దానిపై దాదాపు వారంపాటు కసరత్తు చేసి సీఎం కేసీఆర్కు లిస్ట్ ను అందజేశారు. ఇక ఆర్డర్లు రావడమే తరువాయి అనుకున్నారు. కానీ, సీఎం కేసీఆర్ఆ లిస్ట్ ను పక్కన పెట్టి.. ముగ్గురు మంత్రులకు ఆ బాధ్యతను అప్పగించి ఎవరికి ఎక్కడ పోస్టింగ్ఇవ్వాలనే దానిపై లిస్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మంత్రులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర మంత్రులతో సమన్వయం చేసుకుని వారికి అనుకూలమైన వాళ్లకు పోస్టింగ్లు ఇచ్చేలా లిస్ట్ తయారు చేస్తున్నారు. ప్రగతి భవన్లోనే కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్ రెడ్డి ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.