హైదరాబాద్ రాజేంద్రనగర్ రౌడీలు వీరంగం సృష్టించారు. ఉప్పర్ పల్లి పిస్తా హౌజ్ లోకి ప్రవేశించిన రౌడీలు హోటల్ లో భోజనం చేస్తున్న వారిపై దాడి చేశారు. కారణం లేకుండానే హోటల్ లోని ఫర్నీచర్స్ ను ధ్వంసం చేసి.. భోజనం చేస్తున్న కస్టమర్స్ ను చితకబాదారు. భయంతో యువకులు బయటకు పరుగులు తీశారు.
హోటల్ లోకి వచ్చిన 17 మంది గ్యాంగ్ సభ్యులు మొబైల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. కస్టమర్స్, యాజమాన్యం ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పార్కింగ్ దగ్గర హంగామా చేశారు. టూ వీలర్స్ ద్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన అంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.పిస్టా హౌజ్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.