సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు

సర్పంచులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు

రాష్ట్రంలో సర్పంచులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. రఘోత్తంపల్లి సర్పంచ్ దేవిరెడ్డి రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు సరిగా లేకపోవడంతో.. సర్పంచ్ లు ఆర్థికకంగా దెబ్బతిన్నారని ఆరోపించారు. అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించిన సర్పంచ్ లు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, ఒకరిద్దరు సర్పంచ్ లు ఆత్మహత్య కూడా చేసుకున్నారని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘునందన్.