హైదరాబాద్, వెలుగు: కరోనా నేపథ్యంలో టీఎస్ ఎంసెట్ సిలబస్ను రాష్ట్ర సర్కారు తగ్గించింది. ఎంసెట్లో ఇంటర్ సెకండియర్ నుంచి 70 శాతం, ఫస్టియర్ నుంచి 100 శాతం సిలబస్ ఉంటుందని ప్రకటించింది. జూన్ మూడోవారంలో ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం విద్యాశాఖ స్పెషల్ చీఫ్సెక్రటరీ చిత్రారాంచంద్రన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్, కౌన్సిల్ సెక్రెటరీ శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంసెట్ సిలబస్, క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని ఎప్పటిలాగే కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా సెప్టెంబర్ఫస్ట్ నుంచి ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ పాఠాలు కొనసాగుతుండగా.. ఫిజికల్ క్లాసులు ఫిబ్రవరి ఫస్ట్నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే ఆన్లైన్ పాఠాలు స్టూడెంట్స్ కు పెద్దగా అర్థం కాలేదని ఆఫీసర్లే చెప్తున్నారు. దీంతో ఎంసెట్క్వశ్చన్పేపర్లో మార్పులు తీసుకురావాలని, ఎంసెట్ కన్వీనర్ నియామకం పూర్తయ్యాక, క్వశ్చన్ పేపర్ఎలా ఉండాలనే దానిపై కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు.
స్లాబ్స్ ఆధారంగా డేట్లు: తుమ్మల పాపిరెడ్డి
మే 13 వరకు ఇంటర్ మెయిన్ సబ్జెక్టులకు పరీక్షలు పూర్తవుతాయని, దీంతో జూన్14 తర్వాత ఎప్పుడైనా ఎంసెట్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఆన్ లైన్ ఎగ్జామ్ కావడంతో టీసీఎస్ స్లాబ్స్ ఆధారంగా డేట్లు ఖరారు చేస్తామన్నారు. వారం పది రోజుల్లో అన్ని సెట్ల కన్వీనర్లను నియమిస్తామని వెల్లడించారు. ఎంసెట్ సిలబస్ను శుక్రవారం రాత్రి విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ