గార్ల ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినీల ఆందోళన

గార్ల ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినీల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా గార్ల ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినీలు ఆందోళనకు దిగారు. హాస్టల్ లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ నిరసన తెలిపారు. గార్ల నెహ్రూ సెంటర్ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుల సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. హాస్టల్ వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన ఫుడ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై తమకు క్లారిటీ ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
 
పురుగుల అన్నం పెడుతున్న హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదంటూ చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ లోని బియ్యం, చింతపండును రోడ్డుపై ప్రదర్శించి.. నిరసన తెలిపారు. వారానికి మూడు సార్లు ఎగ్స్ పెట్టాలని ఉన్నా.. కనీసం ఒక్కసారి కూడా ఎగ్ పెట్టడం లేదన్నారు. హాస్టల్ డోర్స్ కు తాళాలు కూడా లేవని చెప్పారు.