న్యూఢిల్లీ : అదానీ–హిండెన్బర్గ్ కేసు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు సెబీ ఇటీవలే తన రిపోర్టును సమర్పించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 కేసు విచారణ జరుపుతున్న కాన్స్టిట్యూషన్ బెంచ్లో చీఫ్ జస్టిస్ఉన్నారని, ఆ కేసు హియరింగ్ కొనసాగుతుండటం వల్లే అదానీ–హిండెన్బర్గ్ కేసు విచారణ వాయిదా పడిందని సమాచారం. ఆగస్టు 14 నాటికే తన రిపోర్టును సెబీ ఇవ్వాల్సి ఉన్నా, మరో 15 రోజుల గడువును కోరింది. ఆ తర్వాత ఆగస్టు 25 నాడు తన రిపోర్టును సుప్రీం కోర్టుకు అందచేసింది.
ఈ రిపోర్టులో ఏముందనేది బయటకు ఇంకా వెల్లడించలేదు. అదానీ కేసులో మొత్తం 24 అంశాలలో దర్యాప్తు జరుపుతుండగా, వాటిలో 22 అంశాలలో దర్యాప్తు ముగిసినట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. టాక్స్హెవెన్స్గా పేరొందిన అయిదు దేశాల నుంచి ఇంకా రిపోర్టులు అందలేదని సెబీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ డేటా అందుబాటులోకి వస్తే తుది రిపోర్టును ఖరారు చేస్తామని సెబీ పేర్కొంటోంది. అకౌంటింగ్ మోసాలతోపాటు, షేర్ల మానిప్యులేషన్కు అదానీ గ్రూప్ పాల్పడుతోందని యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఒక రిపోర్టును ఈ ఏడాది మొదట్లో తెచ్చింది.